టెక్నాలజీ ఓ నలుగురు యువకుల జీవితంలో ఎలాంటి కల్లోలం రేపింది? వారిని అనుకోని సమస్యల్లో ఎలా ఇరికించింది? అదే టెక్నాలజీ సాయంతో వాళ్లెలా బయటపడ్డారనే కథతో రూపొందుతున్న చిత్రం ‘ఐతే 2.0’. రాజ్ మాదిరాజు దర్శకత్వంలో హేమంత్ పల్లపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ పాటలు స్వరపరిచారు. ఓ పాటను ప్రముఖ గాయకుడు నరేశ్ అయ్యర్ ఆలపించారు. ‘‘‘ఆకలి’. ‘ఆశ’, ‘ఆక్రో శం’ కాన్సెప్ట్లతో రూపొందిం చిన ఈ చిత్రం పాటల్లో ‘ఆశ’ కాన్సెప్ట్ మీద సాగే పాటను నరేశ్ అయ్యర్ పాడారు. సాంగ్ రికార్డ్ కాక ముందే ఈ పాటను చిత్రీకరించాం.
దానికి తగ్గట్టు మిక్సింగ్ చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. కిట్టు విస్సాప్రగడ అందించిన లిరిక్స్ఇన్స్పైరింగ్గా ఉన్నాయని నరేశ్ అయ్యర్ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: కౌషిక్ అభిమన్యు, మాటలు-పాటలు: కిట్టు విస్సాప్రగడ.