మళ్లీ మళ్లీ రాని అవకాశం

7 Nov, 2019 00:33 IST|Sakshi
వీకే నరేష్‌

తెలుగు చలనచిత్ర పితామహునిగా పిలుచుకునే రఘుపతి వెంకయ్యనాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రఘుపతి వెంకయ్యనాయుడు’. టైటిల్‌ పాత్రలో సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ నటించారు. ఎల్లో లైన్‌ పిక్చర్స్‌ పతాకంపై మండవ సతీష్‌ బాబు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ– ‘‘రఘుపతి వెంకయ్యనాయుడిగారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికి ఉన్నంతవరకు ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘రఘుపతి వెంకయ్యగారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం’’ అన్నారు బాబ్జీ. తనికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్యప్రియ, భావన తదితరులు నటించిన ఈ సినిమాకు శ్రీ వెంకట్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు