కాబోయే భర్త అంటూ అనౌన్స్‌ చేసేసింది

24 Mar, 2018 14:20 IST|Sakshi

సాక్షి, చెన్నై : లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్‌మ్‌ రౌడీ ధాన్‌(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 

ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్‌ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్‌షిప్‌ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి.

ఇక శుక్రవారం ది హిందూ పత్రిక నిర్వహించిన మహిళా అవార్డుల వేడుకలో నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్న నయన్‌.. తల్లిదండ్రులకు, సోదరుడికి, కాబోయే భర్త(విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించింది. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్న వార్త కన్ఫర్మ్‌ అయిపోయింది.

మరిన్ని వార్తలు