తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి మనస్తాపానికి గురవుతుండడం జరుగుతుంటుంది. అందుకు వివిధ కారణాలు ఉండవచ్చు. నటి నయనతార అలాంటి మనస్తాపానికి గురయ్యారట. ఈ విషయాన్ని యువ దర్శకుడు మోహన్రాజా స్వయంగా తెలిపారు. కోలీవుడ్లో నంబర్వన్ కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఆమె కాల్షీట్స్ కోసం కొత్త దర్శకుల నుంచి ప్రముఖ దర్శకుల వరకూ క్యూలో నిలబడుతున్న పరిస్థితి. అలాంటిది నయనతార మనస్తాపానికి గురవడం ఏమిటనేగా మీ ఆసక్తి. నటుడు జయంరవికి జంటగా ఈ బ్యూటీ తనీఒరువన్ చిత్రంలో నటించిన సంగతి, మోహన్రాజా దర్శకత్వం వహించిన ఆ చిత్రం సంచలన విజయం సా«ధించిన విషయం తెలిసిందే.
అయితే ఆ చిత్రంలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని నయనతార మనస్తాపం చెందారట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తాజాగా అదే దర్శకుడి తాజా చిత్రం వేలైక్కారన్లో నటిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్ కథానాయకుడు. 24 ఫిలింస్ స్టూడియో పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 9వ తేదీన వేలైక్కాన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్రాజా వేలైక్కారన్ గురించి చెబుతూ పరిస్థితులకనుగుణంగా నువ్వు మారవద్దు. నీకు తగ్గట్టుగా పరిస్థితులను మార్చుకో. ఇది ఈ చిత్ర వన్లైన్ స్టోరీ అని తెలిపారు. తనీఒరువన్ చిత్రంలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని మనస్తాపంగా నయనతార ఉందన్నారు. అయితే వేలైక్కారన్ చిత్రంలో ఆమెది చాలా బలమైన పాత్ర అని చెప్పారు. దీంతో తాను ఇంతకు ముందు తప్పుగా భావించానని నయనతార పెద్ద మనసుతో తనతో అన్నారని దర్శకుడు మోహన్రాజా ఈ సందర్భంగా పేర్కొన్నారు.