మళ్లీ జంటగా..

16 Oct, 2019 00:49 IST|Sakshi

బిల్లా, ఏగన్, విశ్వాసం.. ఈ మూడు చిత్రాల్లోనూ జంటగా నటించారు అజిత్, నయనతార. ‘బెస్ట్‌ పెయిర్‌’ అని కూడా అనిపించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం. అజిత్‌ 60వ సినిమా త్వరలో ఆరంభం కానుంది. వినోద్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. నయనతారను సంప్రదించారని కూడా సమాచారం. మరి.. అజిత్‌ 60లో నయనతార ఉంటారా? లేక వేరే కథానాయిక నటిస్తారా? జస్ట్‌ కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

మరిన్ని వార్తలు