ముగ్గురు యువకులను తన చుట్టూ తిప్పుకుంటుంది ఓ యువతి. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమలో... ఎబిసి’. అజయ్, రిషి, క్రాంతి, శ్రీఐరా, రూబీ ముఖ్య తారలు. నాగరాజు.టి దర్శకుడు. జేవీ రెడ్డి నిర్మాత.
ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రేమ, వినోదం, సెంటిమెంట్, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అజయ్, రిషి కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు థ్రిల్కి గురి చేస్తాయి.
శ్రీనివాస్రెడ్డి, ధన్రాజ్ల కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్లేంద్ర, లైన్ ప్రొడ్యూసర్: జె. హరిరెడ్డి.