ఏక్‌ దో తీన్‌...

9 Dec, 2018 05:46 IST|Sakshi
నిధీ అగర్వాల్‌, నాగశౌర్య

ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ కాకముందే సెకండ్‌ సినిమా చాన్స్‌ కొట్టేస్తే లక్కీ అంటాం. సెకండ్‌ సినిమా కూడా పూర్తి కాకముందే మూడో, నాలుగో సినిమాలకూ ఆఫర్స్‌ దక్కించుకుంటే? సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అంటాం. ప్రస్తుతం అదే ఎక్స్‌ప్రెస్‌ స్టీరింగ్‌ దగ్గర కూర్చొని ఎక్సలేటర్‌ని అమాంతం తొక్కేస్తున్నారు నిధీ అగర్వాల్‌. ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధీ ఆ సినిమా రిలీజ్‌ కాకముందే అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బిజీలో ఉన్న నిధి నెక్ట్స్‌ నాగశౌర్య సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారని సమాచారం. సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశ్వనాథ్‌ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా నిధీని ఎంపిక చేసింది చిత్రబృందం. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరిలో మొదలు కానుంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందే సినిమాలోనూ నిధీ అగర్వాల్‌ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు