ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరి జగన్నాద్ కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన యూనిట్.. రెగ్యులర్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రామ్కు జోడిగా హీరోయిన్ను ఎంపిక చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ను హీరోయిన్గా తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్స్లో నిజం లేదని నేడు తేలిపోయింది. ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఆశిష్ విద్యార్థి, సత్య దేవ్, సుధాన్ష్ పాండేలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.