సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

23 Sep, 2019 09:31 IST|Sakshi
ట్రైలర్‌ విడుదలలో నిహారిక తదితరులు

శ్రీనగర్‌కాలనీ: సమాజంలో యువత ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుపుతూ కొత్తగా నిర్మించిన ‘మ్యాడ్‌హౌస్‌’ వెబ్‌ సిరీస్‌ అందరినీ అలరిస్తుందని నటి నిహారిక అన్నారు. జూబ్లీహిల్స్‌లో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నిర్మించిన మ్యాడ్‌హౌస్‌ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌ను ఆదివారం నిహారిక విడుదల చేశారు. గతంలో తాను చేసిన ‘నాన్నకూచి, ముద్దపప్పు ఆవకాయ’ తరహాలో ఈ సిరీస్‌ సరికొత్తగా నెటిజన్లను ఆకట్టుకుందన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాత వందన, డైరెక్టర్‌ మహేష్‌ ఉప్పల, మ్యాపర్‌ మ్యాప్‌ సీఈఓ శుభకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు