రెండోసారి

21 Mar, 2020 05:51 IST|Sakshi

అఖిల్‌ హీరోగా నితిన్‌ మరో సినిమా నిర్మించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కిస్తోన్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో నటిస్తున్నారు అఖిల్‌. ఈ సినిమా తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటించబోతున్నారట. ఈ సినిమాను హీరో నితిన్‌ నిర్మించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే అఖిల్‌ హీరోగా, నితిన్‌ నిర్మాతగా రెండోసారి కలువనున్నారన్నమాట. అఖిల్‌ హీరోగా పరిచయమైన ‘అఖిల్‌: ది పవర్‌ ఆఫ్‌ జువ్వా’ (2015) చిత్రానికి నితిన్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు