రీమేక్‌కి రెడీ

14 Nov, 2019 01:09 IST|Sakshi

బాలీవుడ్‌లో గత ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం ‘అంధాధూన్‌’. ఆయుష్మాన్‌ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్‌  కాబోతోంది. నిర్మాత సుధాకర్‌ రెడ్డి ఈ చిత్ర రీమేక్‌ హక్కులు తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. తాజాగా ఈ రీమేక్‌ను సుధీర్‌ వర్మ హ్యాండిల్‌ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఒరిజినల్‌లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు