ముహూర్తం కుదిరింది

5 Jul, 2018 00:22 IST|Sakshi
నితిన్‌, రాశీఖన్నా

రీసెంట్‌గా మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన హీరో నితిన్‌ పెళ్లి చేసుకున్నారు. కాస్త ఆగి మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేయండి. ఆయన పెళ్లి చేసుకున్నది రియల్‌ లైఫ్‌లో కాదు రీల్‌ లైఫ్‌లో. నితిన్‌ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేతా కథానాయికలుగా నటించారు. ‘‘ఒక సాంగ్, ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. దాదాపు 12 సంవత్సరాల క్రితం మా బ్యానర్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ఇప్పుడు మళ్లీ ‘శ్రీనివాస కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో అందుకోవాలని ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

మరిన్ని వార్తలు