సైంటిస్ట్‌ వర్ష

4 Feb, 2019 02:53 IST|Sakshi

ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల గురించి హిందీలో రూపొందుతున్న సినిమా ‘మిషన్‌ మంగళ్‌’. అక్షయ్‌ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షీ సిన్హా, కీర్తి కుల్హారీ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఇందులో సైంటిస్ట్‌ వర్షా పిళ్లై పాత్రలో నిత్యా మీనన్‌ కనిపిస్తారు.‘‘మిషన్‌ మంగళ్‌’ సినిమా షూట్‌లో చివరి రోజు పాల్గొంటున్నాను’’అని ఆదివారం పేర్కొన్నారు నిత్యా మీనన్‌. జగన్‌ శక్తి దర్శకుడు. నిత్యా మీనన్‌కు హిందీలో తొలి చిత్రమిది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

మరిన్ని వార్తలు