ఏ భాషలో అయినా చేస్తా

9 Mar, 2020 06:29 IST|Sakshi

‘‘నేను తెలుగమ్మాయినే. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశా. సినిమాల పట్ల ఆసక్తితో బాల నటిగా చేశా. ‘అంజి , దేవుళ్ళు’ సినిమాల తర్వాత రామానాయుడు గారి ‘హరివిల్లు’ సినిమా చేశా. ఆ తర్వాత హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించా’’ అని నిత్యాశెట్టి అన్నారు. విశ్వంత్, సంజయ్‌ రావు, నిత్యాశెట్టి ముఖ్య పాత్రల్లో చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. నిత్యాశెట్టి మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’కి ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది.  వెంకటలక్ష్మి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ‘ఓ పిట్టకథ’ బాగుందని చెప్తుంటే  చాలా సంతోషంగా ఉంది. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చేయడానికి సిద్ధం. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. 

మరిన్ని వార్తలు