బర్త్‌డే స్పెషల్‌

1 Dec, 2019 05:44 IST|Sakshi
రామ్‌,నివేదా పేతురాజ్‌

రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెడ్‌’. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణచైతన్య పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో నివేదా పేతురాజ్‌ కథానాయికగా నటించనున్నారు. శనివారం నివేదా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కథానాయికగా ఖరారు చేసిన విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ‘రెడ్‌’ చిత్రబృందం సమక్షంలో  గోవాలో జరిగాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు