శర్వాకు జోడిగా నివేదా..!

12 Oct, 2017 11:07 IST|Sakshi

మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న శర్వానంద్, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శర్వా మార్క్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు సుధీర్ వర్మ స్టైల్ సస్పెన్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా టాలెంటెడ్ మలయాళీ భామ నివేదా థామస్ నటించనుంది. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా నివేదా నటించటం దాదాపు ఖరారైనట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ గా కూడా గతంలో శర్వాతో కలిసి నటించని భామ కోసం ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు