హత్య చేసిందెవరు?

19 Feb, 2019 03:08 IST|Sakshi
బల్వాన్‌,మౌనిక

జాతీయ బాడీ బిల్డర్‌ బల్వాన్‌ హీరోగా ప్రాచి అధికారి, మౌనిక హీరోయిన్లుగా ఎస్‌ఎంఎం ఖాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నైజాం పిల్లోడు’. రెహాన బేగం నిర్మిస్తున్న ఈ సినిమా ఒక్కపాట మినహా పూర్తి అయింది. మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎంఎం ఖాజా మాట్లాడుతూ– ‘‘45 సినిమాల్లో సోలో ఫైటర్‌గా చేసిన బల్వాన్‌ ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. అన్ని రకాల కమర్షియల్‌ హంగులతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు. ‘‘మా సినిమా ద్వారా సంగీత దర్శకుడు మజ్నుని పరిచయం చేస్తున్నాం. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని రెహాన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, సంగీతం: ఎస్‌ కే. మజ్ను.

మరిన్ని వార్తలు