మెగా అభిమానులకు మరో షాక్

17 Dec, 2016 14:41 IST|Sakshi
మెగా అభిమానులకు మరో షాక్

దాదాపు దశాబ్ద కాలంగా మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ రోజు దగ్గరకొచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో సందడి మొదలైపోగా, ఆడియో వేడుక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ గత చిత్రాలు సరైనోడు, ధృవ మాదిరిగానే ఖైదీ నంబర్ 150కి ఆడియో ఫంక్షన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది.

అభిమానుల కోసం ఈ నెల 18న 'అమ్మడు లెట్స్ డు కుమ్మడు' అనే సాంగ్ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 25న ఆడియోను డైరెక్ట్గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి.. తరువాత సినిమా రిలీజ్కు ముందు ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా. సెంటిమెంట్ పరంగా కూడా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసే అవకాశాలే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది.

>