నువ్వూ వద్దు నీ కాల్‌షీట్స్ వద్దు!

12 Dec, 2016 14:37 IST|Sakshi
నువ్వూ వద్దు నీ కాల్‌షీట్స్ వద్దు!

మారుతున్న కాలంతో పాటు తారల ప్రవర్తనా మారుతుందనడానికి ఒక చిన్న ఉదాహరణ నటి సాయిపల్లవి. వర్తమాన తారలు అవకాశాల కోసం అర్రులు చాస్తుంటారు. ఇక మాలీవుడ్ బ్యూటీస్ కోలీవుడ్‌లో పరిచయం అవ్వడానికి తహ తహలాడుతుంటారు. అరుుతే మలయాళీ కుట్టి సాయిపల్లవి మాత్రం పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించే అవకాశాలనే కాలదన్నుకుంటున్నారు. ప్రేమమ్ మలయాళ చిత్రంలో మలర్‌గా టీచర్ పాత్రలో అలరించిన సాయిపల్లవి అన్న విషయం తెలిసిందే. ఆ చిత్ర ఘన విజయంతో సాయిపల్లవికి కోలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నారుు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కార్తీకు జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించే అవకాశాన్ని ఆ పాత్ర గ్లామరస్‌గా ఉందని తోసిపుచ్చినట్లు ప్రచారం జరిగింది.

తాజాగా సియాన్ విక్రమ్, హాస్య కథానాయకుడు సంతానంలతో నటించే అవకాశాలను దర్శక నిర్మాతలను బెదరగొట్టే షరతులతో వదులుకున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలీ అమ్మడి షరతులేమిటో చూద్దామా... నటి సాయిపల్లవి ఇప్పటి వరకూ తమిళంలో ఒక్క చిత్రం కూడా చేయలేదు. అలాంటిది తన పారితోషికాన్ని రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. అదేమంటే మలయాళంలో తన తొలి చిత్రమే సూపర్ డూపర్ హిట్ అయ్యిందని, తమిళంలోనూ తన చిత్రం అంత హిట్ అవుతుందని అంటున్నారట. ఇక పోతే తనను గ్లామర్‌గా నటించాలని ఒత్తిడి చేయరాదన్న కండిషన్‌ను పెడుతున్నారట.


కోలీవుడ్‌లో పరిచయమే కాని సాయిపల్లవి కండిషన్‌‌సకు బెంబేలెత్తుతున్న దర్శక నిర్మాతలు నువ్వూ వద్దు నీ కాల్‌షీట్స్ వద్దని వేరే హీరోయిన్లను ఎంపిక చేసుకునే పనిలో పడుతున్నారు. తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంకు జంటగా సాయిపల్లవిని నటింపచేయాలనుకున్న నిర్మాత ఇప్పుడు నటి అదితిని ఎంపిక చేసుకున్నారు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత గురించి పాపం సాయిపల్లవికి తెలియదేమో?