‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా’

15 Aug, 2018 09:35 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్‌ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఈ రోజు విడుదల చేసింది. ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్స్‌తో ఉన్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది. కత్తి పట్టుకోని ఎన్టీఆర్‌ నోట వచ్చిన మాటలు తూటాల్లా పేలాయి. ‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా ఓబా’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో.. మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు చెప్పిన ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అనే డైలాగ్స్‌  హైలైట్‌గా నిలిచాయి. 

హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్‌ సంబంధించిన లీకులతో అంచనాలు పెరిగిన ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు