నీవెవరు?

4 Nov, 2019 03:37 IST|Sakshi
సుమన్

రిజ్వాన్‌ కల్‌షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. కృష్ణమూర్తి రాజ్‌కుమార్‌ నాయుడు దర్శ కత్వం వహించారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. సుమన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాత్ర ఉందని స్వర్ణకుమారిగారు చెప్పగానే అదృష్టంగా భావించి చేశాను’’ అన్నారు. ‘‘మా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో పరిశోధన చేసి, ఈ సినిమా తీశా’’ అన్నారు కృష్ణమూర్తి రాజ్‌కుమార్‌ నాయుడు.  ఈ చిత్రానికి సంగీతం: ప్రభాకర్, కెమెరా: సూర్య భగవాన్‌ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ.

మరిన్ని వార్తలు