టెక్నాలజీ పేరుతో పరుగులు

29 Jul, 2018 02:16 IST|Sakshi
జితన్‌ రమేష్‌, శృతి యుగల్‌

ప్రముఖ నిర్మాత, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్‌’. ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అన్నది ఉప శీర్షిక. శృతి యుగల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్‌ దర్శకత్వంలో లార్డ్‌ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై నారాయణ్‌ రామ్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘నేటి తరం యువత టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. మానవ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్‌ అద్భుతమైన సంగీతం, రీ–రికార్డింగ్‌’’ అందించారు. ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమా ఇది. వెంకట్‌ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. ఆగస్ట్‌ 22న సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాత నారాయణ్‌ రామ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు