రొమాన్స్... కామెడీ...

26 Oct, 2015 23:43 IST|Sakshi
రొమాన్స్... కామెడీ...

ఆనంద్‌రాజ్, సందీప్, పూజిత, సారిక ముఖ్యతారలుగా గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. ఈ చిత్రం పాటలను నవంబరు 7న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యథార్థ ఘటనల ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని పాటలకూ ప్రణవ్ మంచి స్వరాలందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వర లో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, బిట్ర ప్రకాశ్, కెమెరా: రామ్‌కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.