ఓపెన్ ఛాలెంజ్

25 Jun, 2015 00:23 IST|Sakshi
ఓపెన్ ఛాలెంజ్

సుధీర్‌బాబు, నందిత జంటగా శిరీషా శ్రీధర్  నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ఇటీవ ల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి ఓ టీవీ చానల్‌లో ‘ఇది ఫీల్ గుడ్ మూవీ... కానీ, భయపడి కామెడీని ఇరికించారు’ అని చెప్పారట. ‘‘మంచి సినిమా తీసిన ఆనందంలో ఉన్న మమ్మల్ని ఆ వ్యాఖ్య చాలా బాధపెట్టింది.
 
 అందుకే, ఈ ఓపెన్ ఛాలెంజ్  చేస్తున్నా’’ అని శిరీషా శ్రీధర్ అన్నారు. సవాల్ ఏంటంటే... నేడు (గురువారం) హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 3 గంటల 15 నిమిషాలకు ప్రదర్శితమయ్యే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ షో చూసినవాళ్లు, అక్కడ జరిగే ఈ చిత్రం విజయోత్సవంలో పాల్గొనవచ్చు.
 
 నచ్చినవాళ్లు తమ అనుభూతిని పంచుకోవచ్చు. నచ్చలేదని ఎవరైనా అంటే, టికెట్ డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని శిరీషా శ్రీధర్ అన్నారు. ‘‘సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని ‘8886084077’ నంబర్‌కు వాట్సప్ కూడా చేయొచ్చని అన్నారు.
 

>