బుజ్జిగాడు వస్తున్నాడు

20 Jan, 2020 00:23 IST|Sakshi
రాజ్‌తరుణ్

రాజ్‌తరుణ్, మాళవికా నాయర్‌ జంటగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగ్గట్లు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు విజయ్‌ కుమార్‌. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మా బ్యానర్‌లో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు రాధామోహన్‌. హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు