శరత్‌కుమార్‌కు జోడిగా ఓవియ

19 Jun, 2014 00:38 IST|Sakshi
శరత్‌కుమార్‌కు జోడిగా ఓవియ

 నటి ఓవియ బిగ్ ఆఫర్‌ను అందుకుంది. సుప్రీమ్ స్టార్ శరత్‌కుమార్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని అనూహ్యంగా పొందింది. కొంత విరామం తరువాత శరత్‌కుమార్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఛండమారుతం. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మొదట అవని మోడి, సరయు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే అవనిమోడి అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో అంగీకరించని నిర్మాతలు ఆమెను తొలగించి ఆ పాత్రలో ఓవియను ఎంపిక చేశారు.
 
 నటి అవనిమోడితో ఆరు రోజులు షూటింగ్ కూడా చేశారు. పారితోషికం డిమాండ్‌తోపాటు మలయాళ చిత్రంలో నటిస్తున్న అవనిమోడి కాల్‌షీట్స్ సమస్య కూడా తోడవ్వటంతో ఆమె ను తొలగించినట్లు యూనిట్ వర్గాలు తెలి పారుు. కాగా ఛండమారుతం చిత్రంలో ఓవి య, సరయుతోపాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర వర్గం తెలిపింది. ఈ చిత్రం పక్కా కమర్షియల్ కథాంశంతో రూపొం దుతున్నట్లు వెల్లడించారు. నాట్టామై, సూర్యవంశం చిత్రాల తరువాత శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్ ఆగస్టుకు పూర్తి చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.