ఆగస్టులో తొలి కిరణం

23 Jun, 2017 00:49 IST|Sakshi
ఆగస్టులో తొలి కిరణం

పి.డి రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్‌ ముఖ్య తారలుగా జె. జాన్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. టి.సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న రిలీజ్‌ కానుంది. ‘‘యేసు సిలువ వేసిన తర్వాత, ఆయన అక్కడే ఉన్న 40 రోజులు ఏం జరిగిందన్న కథతో సినిమా ఉంటుంది. సుమారు గంట గ్రాఫిక్స్‌ ఉంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘యేసు పాత్ర చేయడం నా అదృష్టం’’ అని పీడీ రాజు అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌: కె సువార ్తపాల్‌.