ప్రజారంజకంగా పాలించండి : పి.సుశీల

4 Jun, 2019 12:27 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలో గాన కోకిల పి. సుశీల ఆయనకు అభిందనలు తెలిపారు. ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌కు తన ఆశీస్సులు అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్‌ హయాంలో తమ ట్రస్టు ద్వారా ఎందరో కళాకారులకు ఆయన ప్రోత్సాహం అందించారని తెలిపారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా వైఎస్‌ జగన్‌ కూడా ప్రజారంజక పాలన చేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు