‘యాత్ర’ నుంచి గుండెను తాకే పాట

26 Jan, 2019 10:36 IST|Sakshi

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్స్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌ ‘యాత్ర’పై అంచనాలను పెంచేశాయి. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి గుండెను కదిలించే ఓ పాటను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. 

పల్లెల్లో కల ఉంది.. పంటల్లో కలిముంది అంటూ సాగే ఈ పాటలో రైతుల కష్టాలను, వారు పడే బాధలను వివరించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ చిత్రానికి కె (కృష్ణ కుమార్‌) సంగీతాన్ని అందించారు. ఆనందో బ్రహ్మ ఫేమ్‌ మహి వి రాఘవ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న మూడు (తెలుగు, తమిళ, మలయాళ) భాషల్లో విడుదలవుతోంది.

మరిన్ని వార్తలు