ఆత్మ పయనమెటు?

3 Jun, 2018 01:47 IST|Sakshi
సంతోషి, అమర్

అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతేర్వేదమ్‌’. రవికిశోర్‌ దర్శకత్వంలో క్రౌడ్‌ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘మనిషి చనిపోయినప్పుడు.. నిద్రపోయినప్పుడు.. కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయిన వారిని, మనకి తెలియనివారిని కలిసి వస్తుందా? దీనినే మనం కల అనుకుంటున్నామా?.. ఇలాంటి విషయాలన్నీ రాసి ఉన్న తాళపత్ర గ్రంథం పేరే ‘అంతేర్వేదం’. ఆ తాళపత్ర గ్రంథం ఆధారంగా తీసిన చిత్రమే ‘అంతేర్వేదమ్‌’. త్వరలో ట్రైలర్, ఆడియో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సంగీతం: జె.యస్‌. నిథిత్‌.

మరిన్ని వార్తలు