మహేష్‌ ఆ దర్శకుడికి ఓకె చెప్పాడా?

16 May, 2019 16:23 IST|Sakshi

ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ స్టార్ మహేష్ బాబు, వరుసగా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్‌ త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మహేష్ రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా అవుట్‌ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా మహేష్‌ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఓకె చెప్పాడట. పరశురామ్‌ చెప్పిన లైన్‌ నచ్చటంతో ఫుల్‌ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే ఈ వార్తలపై మహేష్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

మరిన్ని వార్తలు