'రేయ్' ఆడియోకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్

1 Jan, 2014 18:54 IST|Sakshi
'రేయ్' ఆడియోకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిచయం అవుతున్న 'రేయ్' చిత్ర ఆడియో కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5 తేదిన శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగనుంది.
 
బొమ్మరిల్లు బ్యానర్ పై నిర్మిస్తున్న 'రేయ్' చిత్రానికి వైవియస్ చౌదరీ దర్శకత్వం వహిస్తుండగా, చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు.
 
సయామీ ఖేర్, శ్రద్దా దాస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంజీవి నటించిన దొంగ చిత్రంలోని 'గోలిమార్.. మార్.. మార్..' అనే పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేశారు.