అలీ కుటుంబానికి పవన్‌ ప్రగాఢ సానుభూతి

19 Dec, 2019 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా అలీ తల్లి జైతున్‌ బీబీ నిన్న రాత్రి ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.

చదవండిఅలీకి మాతృ వియోగం

మరిన్ని వార్తలు