అది తప్ప మిగతా అంతా ఓకే : పాయల్‌ రాజ్‌పుత్‌

24 Dec, 2018 16:16 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌లో వేడి పుట్టించింది పంజాబీ భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ఒక్క సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ హీరోయిన్‌ ‘జీరో’ సినిమాపై చేసిన కామెంట్స్‌, ఫన్నీ వీడియోస్‌ వైరల్‌గా మారాయి.

షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ‘జీరో’ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీలో అనుష్క చేసిన పాత్రకు, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కథాకథనాలు సరిగా లేకపోవడంతో ఆడియెన్స్‌ను చేరుకోలేకపోతోంది. అయితే ఈ సినిమాను వీక్షించిన అనంతరం పాయల్‌ రాజ్‌పుత్‌ చేసిన కామెంట్స్‌, వీడియోస్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

వాటిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క హిట్టు పడ్డంత మాత్రాన ఇలా చేయడం తగదంటూ ఒకరు కామెంట్‌ చేయగా.. మీరు అంటే ఇంతవరకు ఇష్టం ఉండేది కానీ, ఇది చూశాక పోయిందని మరొకరు పాయల్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే తనపై వస్తోన్న నెగెటివిటిని తగ్గించుకునేందుకు వివరణ కూడా ఇచ్చారు.

తాను షారుఖ్‌ నటన గురించి మాట్లాడలేదని.. సినిమాలో కథాకథనాల గురించి మాత్రమే చెప్పానని, పైగా తాను షారుఖ్‌కు పెద్ద అభిమానినంటూ చెప్పుకొచ్చారు. ఫస్ట్‌ హాఫ్‌ సినిమా బాగుందని, సెకండాఫ్‌లో కొంచెం సాగదీతలా అనిపించిందని.. అది తప్ప మిగతా అంతా ఓకే అంటూ వివరణ ఇచ్చుకున్నారు. కానీ అంతలోపే తనపై రావాల్సిన నెగెటివిటీ వచ్చేసింది.

మరిన్ని వార్తలు