ఢిల్లీ టు స్విట్జర్లాండ్‌

28 Jul, 2019 03:07 IST|Sakshi
లొకేషన్‌లో పాయల్, రవితేజ

రాజా ప్రయాణ ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఫ్లైట్‌ ఎక్కడమే ఆలస్యం. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిసింది.

రవితేజ, పాయల్‌ రాజ్‌పుత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఆగస్టు 4న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ‘డిస్కో రాజా’ టీమ్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లనుంది. అక్కడ పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారట. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమాలో రవితేజ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు