మనుషులు.. మనసులు....

10 Mar, 2017 23:49 IST|Sakshi
మనుషులు.. మనసులు....

సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య తారలుగా శ్రీమతి శైలజ సమర్పణలో శశిభూషణ్‌ దర్శకత్వంలో కమల్‌కుమార్‌ పెండెం నిర్మించిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు అవసరాల శ్రీనివాస్‌ రిలీజ్‌ చేశారు.

‘‘నేటి యువత చిన్న చిన్న విషయాలను అపార్థం చేసుకుంటున్నారు. తద్వారా మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే చిత్ర కథ. ఈ నెల 17న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

>