బాక్సాఫీసు వద్ద 'పీకే' కాసుల వర్షం

4 Jan, 2015 11:51 IST|Sakshi
బాక్సాఫీసు వద్ద 'పీకే' కాసుల వర్షం

న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'పీకే'పై ఓ వైపు వివాదాలు, నిరసనలు కొనసాగుతున్నా.. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది.

రెండువారాల్లోనే ఈ కలెక్షన్లు వచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా 600 కోట్ల రూపాయలను వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మార్క్ను దాటితే 600 కోట్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా పీకే సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.