-

బ్రహ్మాండంగా

12 Mar, 2015 23:00 IST|Sakshi
బ్రహ్మాండంగా


 ‘‘ఈ సంస్థ రూపొందించిన పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను. ఆ విధంగా ఈ సంస్థ అధినేత మాణిక్య వేల్‌తో మంచి అనుబంధం ఉంది. తొలి ప్రయత్నంగా వారు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. డ్రీమ్ మర్చంట్స్ సంస్థ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ సమర్పణలో ఆయన తనయుడు పర్వీన్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్లేయర్’. యమున కిశోర్, జగదీశ్ కె. కల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్ దర్శకుడు. ఈ సంస్థ లోగోను ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు, ప్రచార చిత్రాన్ని సిరివెన్నెల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుందనిపిస్తోంది’’ అని ఎస్పీబీ పేర్కొన్నారు. ఈ వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు, ఆర్పీ పట్నాయక్, రిచా పనయ్, శ్రుతీ సోథీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఉంటుందనిపిస్తోంది!