గర్ల్‌ డ్రాగన్‌

8 Mar, 2020 04:06 IST|Sakshi
పూజా భలేకర్‌

విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’. పూజా భలేకర్‌ ప్రధాన పాత్రధారిగా ఇండో–చైనీస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌కు గ్లామర్‌ మేళవించి ఓ కొత్త ట్రెండ్‌లో రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇందులో పూజా చేసే పోరాటాలు హైలైట్‌గా ఉంటాయి. ఇటీవల చైనాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. తాజాగా ఈ చిత్రం వైజాగ్‌ షెడ్యూల్‌ ముగిసింది’’ అని చిత్రబృందం వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు