ఏక్.. దో.. తీన్ అని లెక్కేస్తున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. అవును.. ప్రస్తుతం పూజా హెగ్డే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భారీ ప్రాజెక్ట్స్ సైన్ చేసి ఫుల్ ఫామ్లో ఉన్నారు. వరుస అవకాశాలతో తన డైరీని ఖాళీ లేకుండా నింపేస్తున్నారు పూజా. ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లో హీరోయిన్గా సైన్ చేసిన కొద్ది రోజులకే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 25వ సినిమాలోను ఛాన్స్ కొట్టేశారామె.
వెంటనే పూజా డబుల్ ధమాకా కొట్టేసింది అనుకున్నారంతా. ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే నెక్ట్స్ సినిమాలోనూ పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ లవ్ స్టోరీ మూవీలో ప్రభాస్ ప్రేయసిగా పూజా రొమాన్స్ చేయనున్నారట. దీంతో డబుల్ ధమాకా కాస్తా ట్రిపుల్ ధమకా అయింది. ఈ మూడు భారీ ప్రాజెక్ట్ల తర్వాత పూజ టాప్ లిస్ట్లోకి చేరిపోయే అవకాశం ఉందని ఊహించవచ్చు.