తెలుగులో సూపర్ సక్సెస్తో దూసుకెళ్తోన్న హీరోయిన్ పూజాహెగ్డే బాలీవుడ్లో ఓ బంపర్ చాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు జోడీగా నటించబోతున్నారు. సల్మాన్ హీరోగా ఫర్హాద్–సామ్జీ దర్శకత్వంలో ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. ‘‘సల్మాన్, పూజా తొలిసారి జంటగా నటించబోతున్నారు.
కొత్త జంటగా వీరిద్దరు కథకు ఓ ఫ్రెష్ లుక్ను తీసుకొస్తారు. స్క్రీన్పై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదురుతుందన్న నమ్మకం ఉంది. తొలి షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని వర్క్షాప్స్ ప్లాన్ చేశాం’’ అన్నారు సాజిద్. హృతిక్ రోషన్తో ‘మొహంజోదారో, అక్షయ్ కుమార్తో చేసిన ‘హౌస్ఫుల్ 4’ చిత్రాల తర్వాత పూజా హిందీలో నటించబోతున్న మూడో చిత్రం ఇది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్తో ‘రాధే శ్యామ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాతో పూజా బిజీ.