‘సీమ టపాకాయ్, అవును, నువ్వలా.. నేనిలా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె లీడ్ రోల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. అన్నం చిన్నికృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీకష్ణ క్రియేషన్స్పై గౌరీకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి గౌరీకృష్ణ తండ్రి ఇ.రమేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మాటల రచయిత మరుధూరి రాజా క్లాప్ ఇచ్చారు. గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి, పూర్ణగారైతే ఈ పాత్రకు కరెక్ట్ అని తీసుకున్నాం.
డిసెంబర్ ఫస్ట్ వీక్లో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘డైరెక్టర్గా నా తొలి సినిమా ఇది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో పూర్ణగారిని తీసుకున్నాం. స్టోరీ లైన్ చెప్పగానే ఆమె ఓకే అన్నారు’’ అని అన్నం చిన్నికృష్ణ అన్నారు. ‘‘సెలక్టివ్గా సినిమాలు చేస్తూ వెళ్తున్న తరుణంలో ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఇందులో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది’’ అని పూర్ణ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి.