డార్లింగ్‌ ఈజ్‌ బ్యాక్‌

19 Mar, 2020 05:36 IST|Sakshi
ప్రభాస్‌

షూటింగ్‌ కోసం జార్జియాను చుట్టేశారు ప్రభాస్‌. కొన్ని ఫైట్లు, కూసిన్ని డైలాగ్స్‌తో జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల కోసం జార్జియా వెళ్లింది చిత్రబృందం. కరోనా ప్రభావం, వర్షాలను సైతం లెక్క చేయకుండా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ‘‘డార్లింగ్‌ (ప్రభాస్‌) మళ్లీ తన డార్లింగ్స్‌ (స్నేహితులు) దగ్గరకు వచ్చేశారు. జార్జియాలో షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి, టైటిల్‌ను ప్రకటించాలనుకుంటున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమాను  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు