బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలో దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఎప్పటికప్పుడు చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో హాలీవుడ్ రేంజ్లో ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.