మార్కెట్‌లో ఫైట్‌

22 Mar, 2020 05:19 IST|Sakshi

తిబిలిసీ (జార్జియా రాజధాని) లోని ఫ్లీ మార్కెట్‌కు (పాత వస్తువులు, పురాతన వస్తువులు, సెకండ్‌హ్యాండ్‌ వస్తువులు దొరికే ప్రాంతం) వెళ్లారు ప్రభాస్‌. అక్కడ ఓ గొడవ జరిగింది. విలన్స్‌ను రఫ్ఫాడించారు ప్రభాస్‌. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా  ‘ఓ డియర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా జార్జియా షెడ్యూల్‌ ముగిసింది. అక్కడి ఫ్లీ మార్కెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ ఫైట్‌ను చిత్రీకరించారని సమాచారం. ఈ ఉగాదికి ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జార్జియా షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చారు. కరోనా కారణంగా ఎవరికివారు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభాస్‌ కూడా స్వీయ గృహనిర్భందంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు