ప్రాణం ఉన్న కథ చెబుతా

28 May, 2020 03:15 IST|Sakshi
ప్రకాష్‌రాజ్‌

‘‘మనదేశంలోని ఓ అందమైన మహారణ్యంలో ఉంటున్న జంతుజీవాల గురించి ఎవరూ చెప్పని, ఎక్కడా వినని ప్రాణం ఉన్న కథను చెబుతాను’’ అంటున్నారు ప్రకాష్‌రాజ్‌. వచ్చే నెల 5న ప్రపంచపర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఓ ప్రముఖ చానెల్‌లో జూన్‌ 5న ‘వైల్డ్‌ కర్ణాటక’ అనే ఓ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీకి తెలుగు, తమిళ భాషల్లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు ప్రకాష్‌రాజ్‌. ‘‘ప్రకృతికి గొంతుగా మారిన నా ఈ కొత్త ప్రయాణం అర్థవంతమైనది. వైల్డ్‌లైఫ్‌కి సంబంధించిన ఈ డాక్యుమెంటరీకి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు ప్రకాష్‌రాజ్‌. ఈ ‘వైల్డ్‌ కర్ణాటక’ కన్నడ వెర్షన్‌కు రిషబ్‌శెట్టి, హిందీ వెర్షన్‌కు రాజ్‌కుమార్‌ రావ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు.

మరిన్ని వార్తలు