ప్రతిక్షణం ఉత్కంఠ!

5 Nov, 2017 00:33 IST|Sakshi

అర్జున్‌ కల్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయెల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోడి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ద ప్రాంక్‌’. అమోఘ్‌ పాటలను స్వరపరుస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్‌ పోస్టర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. సరికొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని ఆకాక్షించారు మారుతి.

కొత్త సబ్జెక్ట్‌ను మంచి టెక్నికల్‌ వేల్యూస్‌ రూపొందిస్తున్నారని అన్నారు రాజ్‌ కందుకూరి. ‘‘సరదా పట్టించడానికో లేదా భయపెట్టడానికో ప్రాంక్‌ ఫోన్‌కాల్స్‌ చేయడం, వీడియోలు రూపొందించడం నేటి ట్రెండ్‌లో సాధారణ విషయమే. ఈ కాన్సెప్ట్‌ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్‌ కంప్లీట్‌ అయ్యింది. హైదరాబాద్, గోవా, సింగపూర్‌లలో చిత్రీకరణ జరుపనున్నాం. కథ సింగపూర్‌లో మొదలై అనూహ్య మలుపులతో సాగుతుంది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మహేశ్‌ కోడి.

మరిన్ని వార్తలు