టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

10 Sep, 2019 06:22 IST|Sakshi

ఒక హీరో, ఒక డైరెక్టర్‌ కలిసి, కాసేపు మాట్లాడుకుంటే చాలు.. అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోతుంది. నెక్ట్స్‌ సినిమా స్టోరీ కోసమే కలిశారనే ఊహాగానాలు వినిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఓ టాక్‌ టౌన్‌ అంతా వినిపిస్తోంది. అదే మహేశ్‌బాబు – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌.. మహేశ్‌ని కలిశారని తెలిసింది. ఓ స్క్రిప్ట్‌ విషయమై ఈ ఇద్దరూ చర్చించుకున్నారట. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా ఉండనుందని టాక్‌. ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లో ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌తో సినిమా నిజమే అయితే ఏ సినిమా ముందు సెట్స్‌ మీదకు వెళ్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు