వసూళ్ల పండగే.. ఓపెనింగ్స్‌ అదుర్స్‌

23 Dec, 2019 16:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిసెంబర్‌ 20న విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ.23.25 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్టు యూవీ క్రియేషన్స్‌ వెల్లడించింది. సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ప్రేక్షాదరణ క్రమంగా పెరుగుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు.

తాతమనవళ్లుగా సత్యరాజ్‌-సాయితేజ్‌ ఆకట్టుకున్నారు. సాయితేజ్‌కు జంటగా రాశిఖన్నా నటించింది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యరాజ్‌, రావు రమేశ్‌, విజయ్‌కుమార్‌, నరేశ్‌, ప్రభ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందించాడు.

ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు