ప్రేమ ఎంత మధురం

19 Sep, 2017 12:43 IST|Sakshi
ప్రేమ ఎంత మధురం

చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య తారలుగా  రూపొందిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్‌ రొయ్యూరుతో కలిసి గోవర్ధన్‌ గజ్జల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జితిన్‌ రోషన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను నిర్మాతలు సి.కళ్యాణ్, కిరణ్‌ విడుదల చేశారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. గోవర్ధన్‌ మాట్లాడుతూ– ‘‘సరిగ్గా సంవత్సరం క్రితం ఈ సినిమా కోసం అమెరికాలో ఉద్యోగం వదులుకొని శ్రీకారం చుట్టా. అమెరికాలో అందుబాటులో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో అధిక భాగం అక్కడే షూటింగ్‌ జరుపుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.